‘అస్హాల్’ పోర్టల్ లో పార్టనర్ వర్క్ పర్మిట్ రెన్యువల్ సర్వీస్..!!
- May 18, 2026
కువైట్ః కువైట్ లో డిజిటటీకరణలో భాగంగా వినియోగదారుల కోసం విధానాలను సులభతరం చేస్తోంది.“అస్’హాల్” ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ సొంత వర్క్ పర్మిట్లను పునరుద్ధరించుకోవడానికి వీలు కల్పించే ఒక కొత్త ఎలక్ట్రానిక్ సేవను ప్రారంభించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ప్రకటించింది.ఈ కొత్త సేవ ద్వారా పార్టనర్స్ సర్వీస్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా లేదా మాన్యువల్ ప్రాసెసింగ్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తమ సొంత వర్క్ పర్మిట్లను సులభంగా పునరుద్ధరించుకోవచ్చని అథారిటీ తెలిపింది.
వేగవంతమైన మరియు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించడానికి రూపొందించిన సురక్షితమైన మరియు యూజర్-ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ ద్వారా వినియోగదారులు నేరుగా “అస్ హాల్” పోర్టల్ను యాక్సెస్ చేసి, పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేయవచ్చని అథారిటీ వివరించింది. తమ డిజిటల్ సేవలను విస్తరించడం మరియు ఆధునీకరించడం, లావాదేవీల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాదారులకు అందించే సేవల మొత్తం నాణ్యతను పెంచడం వంటి అథారిటీ విస్తృత వ్యూహంలో భాగంగా ఈ సర్వీసును తీసుకొచ్చినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఇక నుంచి వారంలో నాలుగు రోజులే పనిదినాలు..
- అమెరికా: గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు
- ఒమన్ లో 25 శాతం పెరిగిన కూరగాయల ధరలు..!!
- బహ్రెయిన్-కువైట్ భద్రతా సహకారం బలోపేతం..!!
- పిరికిపంద ఉగ్రవాద దాడి..ఐఏఈఏ చీఫ్ తో యూఏఈ విదేశాంగ మంత్రి..!!
- హజ్ వీసా గడువు దాటితే.. ఫైన్స్, జైలు శిక్ష, బహిష్కరణ..సౌదీ వార్నింగ్..!!
- ఖతార్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సేవలపై నియంత్రణకు గైడ్ లైన్స్ జారీ..!!
- ‘అస్హాల్’ పోర్టల్ లో పార్టనర్ వర్క్ పర్మిట్ రెన్యువల్ సర్వీస్..!!
- IPL 2026: రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాప్టిల్స్ ఘన విజయం..
- ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం..









