రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- May 20, 2026
రోమ్: ఇటలీ రాజధాని రోమ్ చేరుకున్న భారత ప్రతినిధికి అక్కడ ఆత్మీయ స్వాగతం లభించింది. రోమ్ చేరుకున్న అనంతరం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో విందు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం కొలొస్సియంను సందర్శించారు.
ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. భారత్-ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం, గ్లోబల్ అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.
నేడు జరగనున్న అధికారిక సమావేశాల్లో భారత్-ఇటలీ స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు కొనసాగనున్నట్లు వెల్లడించారు.
ఇటలీ పర్యటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







