ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- July 15, 2026
నోయిడా: నేటి కాలంలో ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాలు) వాడకం పెరుగుతున్నప్పటికీ, వాటి వల్ల జరిగే ప్రమాదాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలడం వల్ల సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ఇద్దరు ప్రాణాలను బలితీసుకుంది. మామురా గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బహుళ అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్లో ఉంచిన ఎలక్ట్రిక్ బైక్లో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు(Noida Fire Incident) వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు, దట్టమైన పొగ భవనం పైకి చేరడంతో నివాసితులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే ఏడు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది రంగంలోకి దిగి 50 కుటుంబాలను సురక్షితంగా రక్షించారు.
ఈ ఘోర ప్రమాదం పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆరా తీశారు. బాధితులకు తక్షణమే మెరుగైన సహాయక, వైద్య చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ఏరియా నుంచి పొగ వేగంగా పై అంతస్తులకు వ్యాపించడమే ఈ ప్రాణనష్టానికి ప్రధాన కారణమని జాయింట్ కమిషనర్ రాజీవ్ నారాయణ్ వెల్లడించారు. ఈ ప్రమాదం ఈవీ వాహనాల భద్రతపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.
తాజా వార్తలు
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ







