పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానం చేసిన సీపీ సుమతి
- May 30, 2026
మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఆరుగురు పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ సుమతి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించారు.
పదవీ విరమణ పొందిన వారిలో ఏసీపీ (క్రైమ్స్) కె.కరుణసాగర్, కంట్రోల్ రూమ్ సబ్ ఇన్స్పెక్టర్ పి.బాలరాజు, ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ టి. ప్రభాకర్, సరూర్నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మహమ్మద్ అలీ, అంబర్పేట్ హెడ్క్వార్టర్స్ ఏఆర్ఎస్ఐ ఎం. అంజిరెడ్డి, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ జి. నరేందర్ రెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ సుమతి, పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లు, బాధ్యతలతో కూడుకున్నదని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ క్రమశిక్షణతో, సమర్థవంతంగా సేవలందించిన అధికారులను అభినందించారు.
పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా సమయాన్ని గడపాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే పెన్షన్, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ పాటించాలని సూచిస్తూ, వారికి రావాల్సిన అన్ని పదవీ విరమణ ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ (అడ్మిన్) ఇందిరా, అదనపు డీసీపీ శివకుమార్, సీఏఓ శ్రీనివాస్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, ఏసీపీ (స్పెషల్ బ్రాంచ్) రవీంద్ర రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రా రెడ్డి, కో-ఆపరేటివ్ సెక్రటరీ/ఏసీపీ రమేష్, ఎస్టేట్ ఆఫీసర్ నాయుడు, కో-ఆపరేటివ్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, ట్రెజరర్ బాలరాజు, డైరెక్టర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







