బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- June 03, 2026
మనామా: బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడిందని బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (BDF) ఆరోపించింది. దేశంలోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి యత్నాన్ని బహ్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా తిప్పికొట్టాయని అధికారులు వెల్లడించారు.
బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ (BNA) ప్రచురించిన ప్రకటనలో బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం, దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు మూడు క్షిపణులను మరియు పలు డ్రోన్లను గగనతలంలోనే అడ్డుకుని ధ్వంసం చేశాయి.
ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల ద్వారా బహ్రెయిన్లోని పౌర ప్రాంతాలు, వ్యక్తిగత ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ మానవతా చట్టాలకు వ్యతిరేకంగా జరిగే తీవ్రమైన ఉల్లంఘన అని జనరల్ కమాండ్ పేర్కొంది. ఇలాంటి చర్యలు ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
దాడి యత్నం అనంతరం దేశ భద్రతా వ్యవస్థలను మరింత అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో బహ్రెయిన్ భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







