కార్మికుల సమస్యలపై స్పందించిన సౌదీ కింగ్
- August 09, 2016
భారతీయులు సహా పలు దేశాలకు చెందిన వలస కార్మికులు పడ్తున్న వెతల నుంచి ఉపశమనం కల్పించేందుకు సౌదీ కింగ్ పలు కీలక నిర్ణయాల్ని తీసుకుని, వాటిని అమల్లోకి తీసుకురావాల్సిందిగా సంబంధిత మంత్రిత్వ శాఖలకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికుల్ని ఆదుకునేందుకుగాను 100 మిలియన్ సౌదీ రియాల్స్ (26 మిలియన్ డాలర్లు) కేటాయించారు సౌదీ కింగ్. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, వాటి ప్రభావం కారణంగా సౌదీలో కన్స్ట్రక్షన్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలతో పెద్ద సంఖ్యలో కార్మికులు రోడ్డున పడ్డారు. కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా కార్మికుల్ని తొలగించడంతో సమస్య తీవ్రమైంది. తీవ్రమైన వెతలను అనుభవిస్తున్న తమ దేశ కార్మికుల కోసం భారతదేశం నుంచి సౌదీ ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు అందాయి. అలాగే వారిని ఆదుకునేందుకోసం ప్రభుత్వం ముందుకొచ్చి కొన్ని చర్యలు చేపట్టింది. వీటిల్లో ఆహారం అందించడం, స్వదేశానికి వచ్చేందుకు ఆర్థిక సహాయం, అలాగే పాస్పోర్ట్ క్లియరెన్స్ వంటివాటిల్లో సహాయం చేయడం ద్వారా కొంత ఉపశమనం కలిగించింది భారత ప్రభుత్వం. భారత విజ్ఞప్తిని అలాగే, ఇతర దేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల్ని పరిశీలించిన సౌదీ కింగ్, కార్మికులను ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







