విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్..విద్యావేత్తల కీలక సూచనలు..!!

- June 08, 2026 , by Maagulf
విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్..విద్యావేత్తల కీలక సూచనలు..!!

కువైట్: కువైట్ వ్యాప్తంగా సెకండరీ పాఠశాల విద్యార్థులకు తుది పరీక్షలు జరుగుతున్నాయి.గల్ఫ్ దేశాలను ప్రభావితం చేస్తున్న ప్రాంతీయ ఉద్రిక్తతలు మరియు భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో, పరీక్షలు సజావుగా జరిగేలా చూడటానికి ప్రణాళికలు మరియు పాఠశాలల్లో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. పరీక్షలకు ముందు మరియు పరీక్షల సమయంలో విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి విద్యా మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని గ్రెనడాలోని జాసిమ్ అల్-ఖరాఫీ సెకండరీ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అబ్దుల్ అజీజ్ అల్-జాసిమ్ తెలిపారు. మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్ ద్వారా మోడల్ ప్రశ్నలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను అందించినట్లు చెప్పారు. సెకండరీ స్కూల్ విద్యార్థుల కోసం మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా ఆన్‌లైన్‌లో మరియు ప్రత్యక్షంగా ఇంటెన్సివ్ రివిజన్ క్లాసులు, రివ్యూ సెషన్‌లను నిర్వహించిందన్నారు. పరీక్షా కేంద్రాలలో తగినంత ఎయిర్ కండిషనింగ్, లైటింగ్, చల్లటి తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పరీక్షల ఒత్తిడి
పరీక్షల సమయంలో విద్యార్థులు విజయం సాధించడంలో ఒత్తిడి, ఆందోళనలను నిర్వహించడం ఒక ముఖ్యమైన భాగమని విద్యావేత్తలు అంటున్నారు. చాలా మంది విద్యార్థులు తుది పరీక్షలకు ముందు ఆందోళన, ఒత్తిడిని అనుభవిస్తున్నారని, వారు ఆరోగ్యకరమైన దినచర్యలను, సానుకూల దృక్పథాన్ని కొనసాగించాల్సి అవసరం ఉందని విద్యావేత్తలు, నిపుణులు  చెబుతున్నారు. విద్యార్థులు తమ సమయాన్ని నిర్వహించుకోవాలని, పరధ్యానాలకు దూరంగా ఉండాలని, అవసరమైనప్పుడు తప్ప స్మార్ట్ పరికరాల వాడకాన్ని పరిమితం చేసుకోవాలని విద్యా మంత్రిత్వ శాఖలో సామాజిక కార్యకర్త అయిన మరియం అల్-బ్లూషి సూచించారు. తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని చెప్పారు.  

విద్యార్థులు తమ సామర్థ్యాలను విశ్వసించాలని, సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవాలని మంత్రిత్వ శాఖలోని సామాజిక మరియు మానసిక సేవల విభాగం అధికారిణి షాతా అల్-మర్రి సూచించారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కోవాలని కోరారు. పరీక్షలలో తొందరపడవద్దని, ప్రశ్నలను జాగ్రత్తగా చదవాలని, తమ సమాధానాలను పూర్తి చేయడానికి తగినంత సమయం తీసుకోవాలని సూచించారు. కష్టమైన ప్రశ్నలకు వెళ్లే ముందు సులభమైన ప్రశ్నలతో ప్రారంభించాలని, పరీక్షా కేంద్రాలలో ప్రశాంతంగా ఉండాలని వారు విద్యార్థులకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com