పేటెంట్ పరిశీలనపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన MOCI..!!
- June 11, 2026
దోహా: GCC ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (IP) శిక్షణా కేంద్రంతో కలిసి పేటెంట్ పరిశీలనపై ఒక అధునాతన శిక్షణా కార్యక్రమాన్ని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MOCI), నిర్వహించింది. MOCI మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ విభాగం నుండి పలువురు పేటెంట్ పరిశీలకులు ఈ రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యాధునిక అంతర్జాతీయ పద్ధతులను ప్రదర్శించడం, పరిశీలన విధానాలకు సంబంధించిన నైపుణ్యాన్ని పంచుకోవడం మరియు పేటెంట్లను పరిశీలించడంలో వారి సాంకేతిక మరియు చట్టపరమైన పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
మొత్తంగా, పేటెంట్ల నిష్పాక్షిక పరిశీలన, వర్గీకరణ, అలాగే మేధో సంపత్తికి సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలు మరియు విధానాలు వంటి వృత్తిపరమైన అంశాల ఆధారంగా ఈ కార్యక్రమం రూపొందించారు. అలాగే, పేటెంట్ దరఖాస్తుల పరిశీలన మరియు నిర్వహణలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వ్యవస్థలు మరియు పరిశీలన ప్రక్రియలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగంపై కూడా దృష్టి సారించారు. జాతీయ సామర్థ్యాలు, మేధో సంపత్తి వ్యవస్థ మరియు ఆవిష్కరణలను పెంపొందించడానికి జరుగుతున్న కృషిలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- పేటెంట్ పరిశీలనపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన MOCI..!!
- టైర్లు, ఏసీలను తనిఖీ చేయాలని యూఏఈ వాహనదారులకు పిలుపు..!!
- బహ్రెయిన్ ఆకర్షణను పెంచుతున్న రిటైల్, పర్యాటక రంగాలు..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవు తేదీలను ప్రకటించిన కువైట్ కేబినెట్..!!
- అంతరిక్ష శాంతియుత వినియోగం.. ప్రథమ ఉపాధ్యక్షుడిగా సౌదీ ఎన్నిక..!!
- ప్రాంతీయ పరిణామాలపై చర్చించిన ఒమన్, కెనడా..!!
- ప్రయాణికుల కోసం ‘సమ్మర్ ఎసెన్షియల్స్ కిట్’ను ప్రారంభించిన ఎతిహాద్ ఎయిర్వేస్
- సమాజం, మానవాళి అభ్యున్నతికి విద్యను వినియోగించాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- ఆదిలాబాద్లో సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో భద్రతకు కొత్త దిశ: డీజీపీ ఆనంద్









