కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- June 12, 2026
కువైట్: కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ ముగిసింది. భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (APEDA) సహకారంతో కువైట్లోని భారత రాయబార కార్యాలయం జూన్ 1 నుండి 11 వరకు విజయవంతంగా నిర్వహించింది. భారతదేశపు అత్యుత్తమ మామిడి రకాలను పరిచయం చేయడంతో పాటు ఇరు దేశాల మధ్య వ్యవసాయ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అనేక ప్రచార కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించారు.
ప్రపంచంలోనే మామిడి పండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే భారతదేశం, వివిధ ప్రాంతాలలో పండించే వందలాది రకాల మామిడి పండ్లకు నిలయంగా ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో అల్ఫోన్సో, బంగనపల్లె, బాదామి, కేసర్, దసరి, లంగ్రా, నీలం, ఫజ్లీ, మరియు మల్లిక, అమ్రపాలి వంటి హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. ఇవన్నీ వాటి ప్రత్యేకమైన రుచులు, పోషక విలువలు మరియు అత్యుత్తమ నాణ్యతకు ప్రసిద్ధి చెందినవి.
ఈ వేడుకలలో భాగంగా అత్యుత్తమ నాణ్యత గల భారతీయ మామిడి పండ్లతో పాటు మామిడి సలాడ్, మామిడి సోర్బెట్ మరియు మామిడి మిల్క్షేక్లతో సహా పలు రకాల మామిడి ఆధారిత వంటకాలను సందర్శకు ఆస్వాదించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్







