65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- June 13, 2026
హైదరాబాద్: పోలీసు సంక్షేమానికి ప్రతీకగా నిలిచిన 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను తెలంగాణ డీజీపీ సి.వి.ఆనంద్ శుక్రవారం సందర్శించి సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మెస్ ప్రాంగణాన్ని మొత్తం పరిశీలించిన డీజీపీ, అక్కడి మౌలిక సదుపాయాలు, నిర్వహణ విధానం, సిబ్బంది అవసరాలపై అధికారులతో చర్చించారు. మెస్లోని వివిధ విభాగాలను స్వయంగా పరిశీలిస్తూ ఆధునికీకరణ చర్యల పై సూచనలు చేశారు.
పోలీసు అధికారుల అవసరాలకు అనుగుణంగా మెస్ను మరింత అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించిన డీజీపీ, భవన నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అలాగే, పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ స్థలాన్ని విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెస్ నిర్వహణను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు హెచ్ఆర్ఎన్ఎస్ (HRNS) పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.
పోలీసు అధికారుల సంక్షేమం, సౌకర్యాల మెరుగుదల పోలీసు శాఖ ప్రాధాన్య అంశాల్లో ఒకటని డీజీపీ పేర్కొన్నారు.చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ మెస్ను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







