VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- June 28, 2026
వారణాసి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరం త్వరలో శాకాహార నగరంగా మారనుంది. వారణాసి నగర మున్సిపల్ కార్పొరేషన్(VMC) తన పరిధిలోని మాంసం, చేపలు, కోళ్ల దుకాణాలను నగర శివార్లకు తరలించాలని నిర్ణయించింది. ఈ మేరకు మేయర్ అశోక్ తివారీ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీంతో నగర పరిధిలో ఉన్న 350 నుంచి 400 మాంసం దుకాణాలను రాబోయే ఆరు నెలల్లో దీపావళిలోపు విడతల వారీగా నగర శివార్లకు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ దుకాణాలను రామ్నగర్, సుజాబాద్, గణేశ్పూర్, అవలేష్ నగర్, శివపూర్ ప్రాంతాలకు తరలించనున్నారు. దీంతో కాశీనగరం దేశంలోని రెండవ శాకాహార నగరంగా మారనుంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఏకైక పూర్తి శాకాహార పట్టణంగా గుజరాత్ రాష్ట్రంలోని ‘పాలితానా’ గుర్తింపు పొందింది. ఇక్కడ 2014 నుంచి మాసం, చేపలు, గుడ్లు విక్రయాలపై నిషేధం అమల్లోఉంది. వారణాసిలో హిందువులు 72శాతం, ముస్లింలు 27శాతం ఉన్నారనేఅంచనాలున్నాయి.
తాజా నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నగర పరిశుభ్రత, పుణ్యక్షేత్రం ప్రత్యేకత దృష్ట్యా స్వాగతిస్తుండగా.. మరికొందరు దుకాణాలు దూర ప్రాంతాలకు మారితే వినియోగదారులకు, వ్యాపారులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం మాంసాహారాన్ని నిషేధించడం కాదని.. కేవలం దుకాణాలను వేరే ప్రాంతానికి తరలించి..అక్కడ వ్యాపారాలు చేసుకునేలా అవకాశాలు కల్పిస్తున్నామని చెబుతున్నారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







