యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- June 28, 2026
యూఏఈ: యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత అని న్యాయ నిపుణులు అంటున్నారు.యూఏఈ చట్టం పిల్లలు చేసిన నేరాలకు తల్లిదండ్రులను శిక్షించనప్పటికీ, కొన్ని పరిస్థితులలో పిల్లల చర్యలకు తల్లులు మరియు తండ్రులు సివిల్ మరియు క్రిమినల్ బాధ్యత రెండింటినీ ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా నిర్లక్ష్యం, పిల్లలను ప్రమాదానికి గురిచేయడం, దుష్ప్రవర్తనకు ప్రేరేపించడం లేదా అవసరమైన పునరావాస చర్యలను పాటించడంలో విఫలమవడం వంటి తల్లిదండ్రుల సొంత ప్రవర్తన నేరంగా పరిగణించబడినప్పుడు మాత్రమే క్రిమినల్ బాధ్యత వర్తిస్తుందని బిఎస్ఏ లా (BSA LAW)లో సీనియర్ అసోసియేట్ అయిన అస్మా సిద్ధిఖీ తెలిపారు.
ఇదిలా ఉండగా, సివిల్ బాధ్యత అనేది పిల్లల వల్ల కలిగిన హానికి ఆర్థిక పరిహారం చెల్లించడానికి సంబంధించినది. యుఏఈ పౌర లావాదేవీల చట్టం ప్రకారం, ఒక మైనర్ను పర్యవేక్షించే బాధ్యత గల తల్లిదండ్రులు, సంరక్షకులు లేదా కస్టోడియన్, ఆ పిల్లల వల్ల కలిగే నష్టానికి బాధ్యత వహించవలసి ఉంటుంది. అయితే, బాధ్యత అనేది దానంతట అదే ఏర్పడదు. తాము అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామని లేదా సరైన పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఆ హాని జరిగి ఉండేదని నిరూపించడం ద్వారా తల్లిదండ్రులు తమను తాము సమర్థించుకోవచ్చు.
అమల్ అల్ రషీది లాయర్స్ అండ్ లీగల్ కన్సల్టెంట్స్లో న్యాయ సలహాదారు అయిన డాక్టర్ హసన్ ఎల్హైస్, ఈ వ్యత్యాసాన్ని వివరించే ఒక ఇటీవలి కేసును ఉదహరించారు. స్నాప్చాట్లో ఒక మైనర్ ద్వారా బెదిరింపులకు గురైన యువకుడికి, నష్టపరిహారంగా 3,000 దిర్హమ్లు చెల్లించాలని అల్ ఐన్లోని ఒక సివిల్ కోర్టు ఆ మైనర్ సంరక్షకుడిని ఆదేశించింది. ఈ కేసు సివిల్ నష్టపరిహారం స్థాయిలో పరిష్కరించబడినప్పటికీ, మైనర్లకు సంబంధించిన కేసులలో తల్లిదండ్రుల జవాబుదారీతనాన్ని ఇది తెలియజేస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయడ్డారు.
నేరపూరిత బాధ్యత
యుఏఈ ఫెడరల్ చట్టం ప్రకారం, ఒక చర్య జరిగిన సమయంలో 12 సంవత్సరాల వయస్సు నిండని పిల్లలు నేరపూరితంగా బాధ్యత వహించరు. అయితే, అవసరమైన చోట, పబ్లిక్ ప్రాసిక్యూషన్ న్యాయపరమైన ప్రొబేషన్, ఎలక్ట్రానిక్ నిఘా, సామాజిక సేవ, లేదా బాలల సంఘంలో చేర్చడం వంటి తగిన పరిపాలనా చర్యలను ఆదేశించవచ్చు. కానీ, ఒక బిడ్డపై నేరపూరిత బాధ్యత మోపబడలేదన్నంత మాత్రాన బాధితులు తమ పరిహారం పొందే హక్కును కోల్పోరని అస్మా పేర్కొన్నారు. "బిడ్డను పర్యవేక్షించే బాధ్యత గల తల్లిదండ్రులు, సంరక్షకులు లేదా కస్టోడియన్ నుండి బాధితులు సివిల్ పరిహారం కోరవచ్చు." అని అన్నారు.
బాధ్యతకు సంబంధించిన చట్టపరమైన ఆధారంపై పర్యవసానాలు ఆధారపడి ఉంటాయి. పౌర బాధ్యత సాధారణంగా బాధితునికి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యతకు దారితీస్తుంది. నిర్లక్ష్యం, పర్యవేక్షించడంలో వైఫల్యం, లేదా పిల్లలను ప్రమాదానికి గురిచేయడం వంటి బాలల సంరక్షణ ఉల్లంఘనలకు జైలు శిక్ష లేదా Dh5,000 కంటే తక్కువ కాని జరిమానా విధించవచ్చు.
తీవ్రమైన కేసులకు మరింత కఠినమైన శిక్షలు ఉండవచ్చు. ఒక ఫెడరల్ చట్టం ప్రకారం, మైనర్ను నేరానికి పాల్పడేలా ప్రేరేపించడం లేదా సహాయం చేయడం జైలు శిక్ష మరియు Dh50,000 కంటే తక్కువ కాని జరిమానాలు విధించే అవకాశం ఉంది.ఇక ప్రవాసుల విషయానికొస్తే, యూఏఈ శిక్షాస్మృతి ప్రకారం దేశ బహిష్కరణకు ఆదేశించబడిన నేరానికి ఒక విదేశీయుడు దోషిగా తేలితే, దేశ బహిష్కరణ కూడా వర్తించవచ్చు.
గత నెలలో, షార్జాలో ఒక పసిపాప మరణంలో ప్రమేయం ఉందని అనుమానించబడిన ఇద్దరు బాలికల తల్లిదండ్రులను ఆ బాలికల చర్యలకు గాను అరెస్టు చేసి, ఆ తర్వాత బెయిల్పై విడుదల చేశారు. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది
తల్లిదండ్రులకు చట్టపరమైన రక్షణలు
తల్లిదండ్రులకు కీలకమైన రక్షణలు ఉన్నాయని ఇద్దరు నిపుణులు అంగీకరిస్తున్నారు. సివిల్ ట్రాన్సాక్షన్స్ లాలోని ఆర్టికల్ 265 ప్రకారం, తల్లిదండ్రులు తమ పర్యవేక్షణ విధిని అవసరమైన జాగ్రత్తలతో నెరవేర్చారని లేదా సరైన పర్యవేక్షణ ఉన్నప్పటికీ హాని జరిగి ఉండేదని నిరూపించడం ద్వారా సివిల్ బాధ్యత నుండి తప్పించుకోవచ్చని డాక్టర్ హసన్ వివరించారు.
నేరపరంగా, రక్షణ చాలా సులభం: మరొక వ్యక్తి చేసిన నేరానికి తల్లిదండ్రులను దోషులుగా నిర్ధారించలేరు. మరొక వ్యక్తి చేసిన నేరానికి శిక్ష విధించడాన్ని యూఏఈ చట్టం తిరస్కరిస్తుంది. తమ చట్టపరమైన పర్యవేక్షణ విధిని నెరవేర్చడానికి, డాక్టర్ హసన్ మరియు అస్మా తల్లిదండ్రులకు సలహాలను పట్టారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







