కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..

- July 01, 2026 , by Maagulf
కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..

కరీంనగర్: కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో బుధవారం మరోసారి ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది.డిపోలో నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ బస్సులో బ్యాటరీలో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

మంటలను గమనించిన డిపో సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక పరికరాలతో వాటిని అదుపులోకి తీసుకువచ్చారు.ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే బస్సుకు కొంత మేర నష్టం జరిగినట్లు సమాచారం.

ఈ ఘటన పై ఆర్టీసీ అధికారులు విచారణ ప్రారంభించారు. బ్యాటరీలో సాంకేతిక లోపమే మంటలకు కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

కాగా, పది రోజుల వ్యవధిలో కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడం ఇది రెండో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.వరుస ఘటనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల భద్రత, నిర్వహణ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.

--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com