నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..

- July 01, 2026 , by Maagulf
నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..

నంద్యాల: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా చేపట్టిన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కార్యక్రమం బుధవారం మూడో రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో పార్టీ భావజాలంపై ఆసక్తి కలిగిన జనసేన నాయకులు, జనసైనికులు వివిధ స్థాయిల్లోని పార్టీ పదవులకు దరఖాస్తులు సమర్పించాలని పిలుపునిచ్చారు.పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, అర్హులైన నాయకులకు అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.

ఈ సమావేశంలో నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చింతా సురేష్ బాబు, పాణ్యం నియోజకవర్గ ముఖ్య నాయకులు, జనసైనికులు, వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ పై సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com