నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- July 01, 2026
నంద్యాల: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా చేపట్టిన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కార్యక్రమం బుధవారం మూడో రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో పార్టీ భావజాలంపై ఆసక్తి కలిగిన జనసేన నాయకులు, జనసైనికులు వివిధ స్థాయిల్లోని పార్టీ పదవులకు దరఖాస్తులు సమర్పించాలని పిలుపునిచ్చారు.పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, అర్హులైన నాయకులకు అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.
ఈ సమావేశంలో నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చింతా సురేష్ బాబు, పాణ్యం నియోజకవర్గ ముఖ్య నాయకులు, జనసైనికులు, వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ పై సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- దుబాయ్ రోబోట్యాక్సీ 40 లక్షల కిలోమీటర్లు పూర్తి.. ప్రయాణికుల సంతృప్తి 97 శాతం
- ట్రంప్ హెచ్చరికల పై ఘాటుగా స్పందించిన ఇరాన్
- బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫఖ్రూల్
- సోషల్ మీడియాలో ఎమిరాతీ మహిళలను అవమానించినందుకు UAE చర్యలు
- అల్ రమ్లీ అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం..!!
- ఖతార్లో భారీగా పెరిగిన డిజిటల్ పేమెంట్స్..!!
- యూఏఈలో స్కూళ్లు రీ ఓపెన్.. పేరెంట్స్ పై పెరగనున్న ఖర్చుల భారం..!!
- రియాద్ విమానాశ్రయంలో ‘సైలెంట్ ఎయిర్పోర్ట్’ ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- కువైట్లో కల్తీ ఆహారంపై అధికారుల కొరడా..!!
- ఇద్దరు పౌరులను ఆస్పత్రికి తరలించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!







