కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- July 01, 2026
కరీంనగర్: కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో బుధవారం మరోసారి ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది.డిపోలో నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ బస్సులో బ్యాటరీలో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
మంటలను గమనించిన డిపో సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక పరికరాలతో వాటిని అదుపులోకి తీసుకువచ్చారు.ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే బస్సుకు కొంత మేర నష్టం జరిగినట్లు సమాచారం.
ఈ ఘటన పై ఆర్టీసీ అధికారులు విచారణ ప్రారంభించారు. బ్యాటరీలో సాంకేతిక లోపమే మంటలకు కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
కాగా, పది రోజుల వ్యవధిలో కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడం ఇది రెండో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.వరుస ఘటనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల భద్రత, నిర్వహణ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంలో ‘సైలెంట్ ఎయిర్పోర్ట్’ ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- కువైట్లో కల్తీ ఆహారంపై అధికారుల కొరడా..!!
- ఇద్దరు పౌరులను ఆస్పత్రికి తరలించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- దుబాయ్లో డెలివరీ రైడర్లకు ఉచిత భోజనం..ఆర్టీఏ కీలక కార్యక్రమం
- జైవాన్ పేమెంట్స్ స్వీకరించిన తొలి ఎయిర్లైన్గా ఎతిహాద్ ఎయిర్వేస్
- చీనాబ్ బ్రిడ్జి పై తొలిసారి 100 కిమీ వేగంతో వందే భారత్
- రూపారెడ్డి హత్య కేసులో నిందితుల విలాసవంతమైన జీవనశైలి
- విండ్షీల్డ్ శుభ్రం చేయడం పై పెట్రోల్ పంప్ సిబ్బందితో గొడవ.. ఇద్దరికి భారీ జరిమానా
- ఏపీలో ఆగని జూడాల సమ్మె
- ఇరాన్పై డోనాల్డ్ ట్రంప్ కొత్త ఆంక్షల వ్యూహం







