కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- July 01, 2026
కరీంనగర్: కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో బుధవారం మరోసారి ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది.డిపోలో నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ బస్సులో బ్యాటరీలో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
మంటలను గమనించిన డిపో సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక పరికరాలతో వాటిని అదుపులోకి తీసుకువచ్చారు.ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే బస్సుకు కొంత మేర నష్టం జరిగినట్లు సమాచారం.
ఈ ఘటన పై ఆర్టీసీ అధికారులు విచారణ ప్రారంభించారు. బ్యాటరీలో సాంకేతిక లోపమే మంటలకు కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
కాగా, పది రోజుల వ్యవధిలో కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడం ఇది రెండో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.వరుస ఘటనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల భద్రత, నిర్వహణ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!







