కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!

- July 01, 2026 , by Maagulf
కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!

కువైట్: జూన్ 30న బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఒప్పందం గడువు ముగియడంతో.. జూలై 1 నుండి పాస్‌పోర్ట్, కాన్సులర్ మరియు వీసా సేవలు కేవలం అత్యవసర కేసులకు మాత్రమే పరిమితం చేయబడతాయని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

కొత్త సేవా ప్రదాత అయిన డూ డిజిటల్.. జూలై 1 నుండి పాస్‌పోర్ట్ మరియు కాన్సులర్ సేవలను ప్రారంభించాల్సి ఉంది. అయితే, పరిపాలనా కారణాల వల్ల అత్యవసర సేవలు మాత్రమే అందించబడతాయని రాయబార కార్యాలయం ఒక అత్యవసర ప్రకటనను జారీ చేసింది. జూలై 2 నుండి సేవల కొనసాగింపు విషయాన్ని తరువాత ప్రకటించబబుతుందని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

ఇక అత్యవసర సేవల్లో తత్కాల్ పాస్‌పోర్ట్‌లు, ఎన్‌ఆర్‌ఐ సర్టిఫికెట్లు, గడువు ముగియనున్న సివిల్ ఐడీలు ఉన్న దరఖాస్తుదారుల కోసం స్వల్పకాలిక పాస్‌పోర్ట్‌లు, అత్యవసర సర్టిఫికెట్లు మరియు ఇ-వీసాలు ఉన్నాయి.

జూలై 1 నుండి తదుపరి ప్రకటన వచ్చే వరకు ఏ ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ (ICAC) కూడా దరఖాస్తులను స్వీకరించదని రాయబార కార్యాలయం ప్రకటించింది. అత్యవసర సేవలు అవసరమైన దరఖాస్తుదారులు అవసరమైన సహాయక పత్రాలతో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల మధ్య రాయబార కార్యాలయం కాన్సులర్ విభాగాన్ని సంప్రదించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com