కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- July 01, 2026
కువైట్: జూన్ 30న బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఒప్పందం గడువు ముగియడంతో.. జూలై 1 నుండి పాస్పోర్ట్, కాన్సులర్ మరియు వీసా సేవలు కేవలం అత్యవసర కేసులకు మాత్రమే పరిమితం చేయబడతాయని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
కొత్త సేవా ప్రదాత అయిన డూ డిజిటల్.. జూలై 1 నుండి పాస్పోర్ట్ మరియు కాన్సులర్ సేవలను ప్రారంభించాల్సి ఉంది. అయితే, పరిపాలనా కారణాల వల్ల అత్యవసర సేవలు మాత్రమే అందించబడతాయని రాయబార కార్యాలయం ఒక అత్యవసర ప్రకటనను జారీ చేసింది. జూలై 2 నుండి సేవల కొనసాగింపు విషయాన్ని తరువాత ప్రకటించబబుతుందని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఇక అత్యవసర సేవల్లో తత్కాల్ పాస్పోర్ట్లు, ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లు, గడువు ముగియనున్న సివిల్ ఐడీలు ఉన్న దరఖాస్తుదారుల కోసం స్వల్పకాలిక పాస్పోర్ట్లు, అత్యవసర సర్టిఫికెట్లు మరియు ఇ-వీసాలు ఉన్నాయి.
జూలై 1 నుండి తదుపరి ప్రకటన వచ్చే వరకు ఏ ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ (ICAC) కూడా దరఖాస్తులను స్వీకరించదని రాయబార కార్యాలయం ప్రకటించింది. అత్యవసర సేవలు అవసరమైన దరఖాస్తుదారులు అవసరమైన సహాయక పత్రాలతో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల మధ్య రాయబార కార్యాలయం కాన్సులర్ విభాగాన్ని సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్: మత వర్గాన్ని అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు..60 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
- స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న ఏడాది చిన్నారికి దుబాయ్ రూలర్ అండ
- సౌదీ విమానాశ్రయం, అరామ్కో కేంద్రంపై దాడులు చేశామని హూతీలు ప్రకటన
- సెప్టెంబర్ 1 నుంచి కువైట్లో విజిట్ వీసా, అబ్సెన్స్ పర్మిట్ పొడిగింపులు నిలిపివేత
- స్పెషలైజ్డ్ వింగ్స్ హెచ్ఓడీలతో డీజీపీ సి.వి.ఆనంద్
- దుబాయ్ రోబోట్యాక్సీ 40 లక్షల కిలోమీటర్లు పూర్తి.. ప్రయాణికుల సంతృప్తి 97 శాతం
- ట్రంప్ హెచ్చరికల పై ఘాటుగా స్పందించిన ఇరాన్
- బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫఖ్రూల్
- సోషల్ మీడియాలో ఎమిరాతీ మహిళలను అవమానించినందుకు UAE చర్యలు
- అల్ రమ్లీ అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం..!!







