బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- July 01, 2026
మస్కట్: ఒమాన్లో నివసిస్తున్న కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు కమాలుద్దీన్ అన్వర్షా అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ తాజా వారాంతపు ఈ-డ్రాలో 25,000 దిర్హామ్లు గెలుచుకున్నారు.
45 ఏళ్ల కమాలుద్దీన్ గత రెండు దశాబ్దాలుగా ఒమాన్లో నివసిస్తున్నారు. గత రెండేళ్లుగా బిగ్ టికెట్ లాటరీలో క్రమం తప్పకుండా పాల్గొంటున్న ఆయన, జూన్ నెల చివరి వారాంతపు డ్రాలో విజేతగా నిలిచారు.
ఈ బహుమతి ద్వారా తన పై ఉన్న ఆర్థిక బాధ్యతలను, ముఖ్యంగా పెండింగ్లో ఉన్న అప్పులను తీర్చుకోవడానికి ఉపయోగించనున్నట్లు కమాలుద్దీన్ తెలిపారు. అయితే ఈ విజయంతో ఆగిపోకుండా, భవిష్యత్తులో మరింత పెద్ద బహుమతిని గెలుచుకోవాలనే ఆశతో బిగ్ టికెట్ డ్రాల్లో పాల్గొనడం కొనసాగిస్తానని చెప్పారు.
ఇదిలా ఉండగా, బిగ్ టికెట్ జూలై నెల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా ఆగస్టు 3న నిర్వహించనున్న మెగా డ్రాలో 2 కోట్ల దిర్హామ్ల (Dh20 million) గ్రాండ్ ప్రైజ్ను విజేతకు అందజేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!







