యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి

- July 04, 2026 , by Maagulf
యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి

దుబాయ్: తీవ్ర వేసవి ఉష్ణోగ్రతల నుంచి కార్మికులను రక్షించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అమల్లో ఉండే ఆక్యుపేషనల్ హీట్ స్ట్రెస్ ప్రివెన్షన్ పాలసీ కింద డెలివరీ రైడర్ల కోసం కీలక నిబంధనలు అమలు చేస్తోంది.

ఈ నిబంధనల ప్రకారం, మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు డెలివరీ రైడర్లను వారు ఇష్టపడకపోతే విధుల్లో కొనసాగాలని బలవంతం చేయరాదు. ఈ సమయంలో రైడర్లకు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించాల్సి ఉంటుంది.

అలాగే, నడిచి (వాకింగ్) చేసే డెలివరీలను మధ్యాహ్న విరామ సమయంలో పూర్తిగా నిషేధించారు. తీవ్ర ఎండలో నడక ద్వారా డెలివరీలు చేయడం వల్ల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇంకా, పరిమితి సమయాల్లో డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు ఒక రైడర్‌కు గరిష్టంగా మూడు ఆర్డర్లకే అనుమతి ఇవ్వాలి. అంతేకాకుండా, ఆ మూడు ఆర్డర్లను పూర్తి చేయడానికి పట్టే మొత్తం డెలివరీ సమయం 60 నిమిషాలను మించకూడదు.

తీవ్ర వేసవి వేడిలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ మార్గదర్శకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. హీట్ స్ట్రెస్, డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలను నివారించడం, డెలివరీ రైడర్ల సంక్షేమాన్ని మెరుగుపరచడం ఈ విధాన ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com