బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ

- July 15, 2026 , by Maagulf
బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ

రియాద్: బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ప్రధాన కార్యదర్శి జాసెమ్ మహ్మద్ అల్ బుదైవీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులతో పాటు కీలక మౌలిక వసతులు, అత్యవసర స్థాపనలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

బుధవారం విడుదల చేసిన ప్రకటనలో అల్ బుదైవీ మాట్లాడుతూ, ఇరాన్ చర్యలు అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించడమే కాకుండా, ప్రాంతాన్ని మరింత ఉద్రిక్తతలు, అస్థిరత వైపు నెట్టే ప్రమాదకర పరిణామాలకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఇలాంటి చర్యలు ప్రాంతీయ భద్రత, శాంతికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నియమాలను నిర్లక్ష్యం చేస్తూ ఇరాన్ వ్యవహరిస్తోందని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాల భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు ఆ దేశాలు తీసుకుంటున్న అన్ని చర్యలకు జీసీసీ పూర్తి మద్దతు ఉంటుందని అల్ బుదైవీ తెలిపారు.

గల్ఫ్ దేశాల ఐక్యత, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడేందుకు సభ్య దేశాలు కలిసి పనిచేస్తాయని, శాంతి, భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా జీసీసీ వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com