కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- July 18, 2026
రియాద్: కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ జరిపిన దాడులను గల్ఫ్ సహకార మండలి (GCC) తీవ్రంగా ఖండించింది. జీసీసీ ప్రధాన కార్యదర్శి జాసెం మహ్మద్ అల్బుదైవి విడుదల చేసిన ప్రకటనలో, బహ్రెయిన్ రాజ్యం, కువైట్ రాష్ట్రం, జోర్డాన్ హషిమైట్ రాజ్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడులు అత్యంత దుర్మార్గమైనవని పేర్కొన్నారు.
అంతేకాకుండా కీలక మౌలిక సదుపాయాలు, పౌర సౌకర్యాలపై జరిగిన దాడుల కారణంగా కువైట్లో పలువురు పౌర కార్మికులు గాయపడడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు.
ఇరాన్ చర్యలు అత్యంత ప్రమాదకరమైన ఉద్రిక్తతకు దారితీసే చర్యలని, ఇవి అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి (UN) చార్టర్కు ఘోర ఉల్లంఘన మాత్రమే కాకుండా యుద్ధ నేరాల పరిధిలోకి వస్తాయని అల్బుదైవి స్పష్టం చేశారు. పౌర మౌలిక సదుపాయాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం అన్ని అంతర్జాతీయ నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధమని, ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇరాన్ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాల భద్రత, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు అవి తీసుకునే అన్ని చర్యలకు జీసీసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రధాన కార్యదర్శి ప్రకటించారు.
అలాగే కువైట్లో గాయపడిన పౌరులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, గల్ఫ్ దేశాల భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలనైనా జీసీసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







