కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- September 02, 2026
ఆఫ్రికా ఖండంలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ అత్యంత వేగంగా మరియు ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. గత మే 15 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి ఏకంగా 3,007 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు 6,186 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగోలోని ఆరు ప్రధాన ప్రావిన్స్లలో ఈ వైరస్ దారుణంగా విస్తరిస్తోంది.
సవాలుగా మారిన కేసుల గుర్తింపు మరియు చికిత్స
కాంగోలో ఎబోలా తీవ్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో కొత్త కేసులను సకాలంలో గుర్తించడం వైద్య సిబ్బందికి అత్యంత సవాలుగా మారిందని తెలిపింది. ఈ మహమ్మారి బారిన పడుతున్న వారిలో సరైన సమయంలో వైద్యం అందక, దాదాపు 60 శాతం మంది మరణాలు ప్రత్యేక చికిత్స కేంద్రాల వెలుపలే సంభవించినట్లు డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. వైరస్ కట్టడికి స్థానిక ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు ముమ్మర చర్యలు చేపడుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







