తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- July 21, 2026
తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పర్యాటకరంగాల ప్రగతికి విమానయాన రంగాన్ని విస్తరించడం ఎంతో కీలకంగా మారింది. ఇందులో భాగంగా వరంగల్ విమానాశ్రయంతో పాటు పలు జిల్లాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి ఎయిర్పోర్ట్స్ (New Airports In Telangana)అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వేగంగా అడుగులు వేస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని కీలక ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్ విమానాశ్రయ పునరుద్ధరణ, పూర్తిస్థాయి అభివృద్ధి కోసం AAI సుమారు రూ. 496.86 కోట్ల వ్యయంతో సూత్రప్రాయ ఆమోదం తెలపడమే కాకుండా, రన్వే, టాక్సీవే, సరిహద్దు గోడ నిర్మాణాల కోసం టెండర్లను సైతం ఆహ్వానించింది.
అయితే, భూసేకరణ, పర్యావరణ అనుమతులు, నిధుల లభ్యత ఆధారంగానే ఈ ప్రాజెక్టు పూర్తి కానుందని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. మరోవైపు ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర, రక్షణ రంగాల ఉమ్మడి వినియోగం కోసం అభివృద్ధి చేసేందుకు AAI ఇప్పటికే ఫీజిబిలిటీ అధ్యయనం పూర్తి చేసింది. అలాగే పెద్దపల్లిలోని గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రాథమిక నివేదికను రాష్ట్రానికి అందజేయగా, భద్రాద్రి కొత్తగూడెం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ నూతన విమానాశ్రయాలు పూర్తయితే తెలంగాణలో ప్రాంతీయ అనుసంధానం మరింత బలోపేతం కానుంది.
తాజా వార్తలు
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!







