ఏపీకి రిలయన్స్ సరికొత్త సంచలనం..
- July 31, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు మరో మైలురాయి లాంటి భారీ పారిశ్రామిక పెట్టుబడి రాబోతోంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఏపీలో ఏకంగా రూ.లక్ష కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్ట్ను చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ఈ-వేలంలో ఏలూరు జిల్లాలోని చింతలపూడి, రేచెర్ల బొగ్గు గనులను రిలయన్స్ దక్కించుకుంది. అక్కడ దేశంలోనే మొదటి సరికొత్త సాంకేతికతతో కూడిన అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (Underground Coal Gasification) ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయనుంది.
3,130 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు–ఆధునిక సాంకేతికత
ఏలూరు జిల్లాలోని ఈ గనుల్లో భారీ ఎత్తున బొగ్గు నిల్వలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
చింతలపూడి బ్లాక్: 1,200 హెక్టార్ల విస్తీర్ణంలో 904.94 మిలియన్ టన్నుల (G-12 రకం) బొగ్గు నిల్వలు.
రేచెర్ల బ్లాక్: 2,225 హెక్టార్ల విస్తీర్ణంలో 2,225.67 మిలియన్ టన్నుల (G-13 రకం) బొగ్గు నిల్వలు.
మొత్తం నిల్వలు: 3,130.61 మిలియన్ టన్నులు.
భారీ లోతులో ఉన్న ఈ బొగ్గును సాంప్రదాయ పద్ధతిలో తవ్వి తీయడం ఖర్చుతో కూడుకున్నందున, నేరుగా భూగర్భంలోనే మండించి సింథటిక్ గ్యాస్ (Syngas), అమ్మోనియా, అమ్మోనియం నైట్రేట్లను ఉత్పత్తి చేస్తారు. 2029 నాటికి ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని రిలయన్స్ భావిస్తోంది.
విజయనగరంలో రూ.1.08 లక్షల కోట్లతో AI డేటా సెంటర్
కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్తో పాటు ఏపీలో రిలయన్స్ మరొక మెగా ప్రాజెక్ట్పై దృష్టి సారించింది. రూ.1,08,010 కోట్ల వ్యయంతో విజయనగరం జిల్లాలో 1.5 గిగావాట్ల (GW) సామర్థ్యంతో గిగా-స్కేల్ AI డేటా సెంటర్ను (AIDC) నిర్మించనుంది. మొదటి దశలో రూ.45,610 కోట్లు, రెండో దశలో రూ.62,400 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా, ప్రభుత్వం విజయనగరంలో 853.97 ఎకరాల భూమిని సేకరించింది. ఈ రెండు మెగా ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







