విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- August 01, 2026
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘనంగా వీడ్కోలు పలికారు. జూలై 31న కమిషనరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సీపీ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన అధికారులు తమ సుదీర్ఘ సేవా కాలంలో ప్రజలకు, పోలీసు శాఖకు విశిష్ట సేవలు అందించారని ప్రశంసించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజాసేవ, నేర నియంత్రణతో పాటు శాఖ అభివృద్ధికి వారు చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
వారి సేవాభావానికి కృతజ్ఞతలు తెలియజేసిన సీపీ, పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. అలాగే తమ అనుభవాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు, సహచర అధికారులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. డీసీపీ (అడ్మిన్) టి. అన్నపూర్ణ, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ వై.వి.ఎస్. సుధీంద్ర, సైబర్ క్రైమ్ డీసీపీ కె. పుష్ప, డీసీపీ (కార్ హెడ్క్వార్టర్స్) పి. సంజీవ్, ఏడీసీపీ షమీర్, సీఏఓ (అకౌంట్స్) వెంకట్ రెడ్డి, ఏఓ (అడ్మిన్) వై.వి.ఎస్. జ్యోతిర్మణి, ఎస్టేట్ ఆఫీసర్ ఆర్ఐ హిమాకర్, కో-ఆపరేటివ్ సొసైటీ ఇన్చార్జి ఎస్ఐ జి. మల్లేశం తదితరులు హాజరై విరమణ పొందిన అధికారులను సత్కరించారు.
విరమణ పొందిన అధికారులు
- ఎస్ఐ ఆర్. కిషన్ సింగ్ – మొయినాబాద్ పోలీస్ స్టేషన్
- ఎస్ఐ ఎల్. రాజేశ్వర్ – షాద్నగర్ పోలీస్ స్టేషన్
- ఆర్ఎస్ఐ మహమ్మద్ అబ్దుల్ ఖాదీర్ – సీఏఆర్ హెడ్క్వార్టర్స్
- ఆర్ఎస్ఐ మహమ్మద్ మక్సూద్ ఘౌరీ – సీఏఆర్ హెడ్క్వార్టర్స్
- ఆర్ఎస్ఐ మహమ్మద్ అబ్దుల్ జలీల్ – సీఏఆర్ హెడ్క్వార్టర్స్
- ఎస్ఐ మహమ్మద్ నూర్ ఉద్దీన్ – ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్
- హెడ్ కానిస్టేబుల్ గెనుగుల రమేష్ – రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్
వీడ్కోలు కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగగా, విరమణ పొందిన అధికారుల సేవలను సహచరులు గుర్తు చేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







