మోటరిస్టులకు 264 వార్నింగ్స్
- August 15, 2016
మోటరిస్టులకు 264 వార్నింగ్స్ని అబుదాబీ మునిసిపాలిటీ జారీ చేసింది. తమ వాహనాల్ని ఎక్కువసేపు పబ్లిక్ స్పేసెస్పై నిబంధనలకు విరుద్ధంగా నిలిపివేసినందుకుగాను ఈ వార్నింగ్స్ జారీ అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఆగస్ట్ 15న ఈ మేరకు వార్నింగ్స్ని జారీ చేశారు. ఐదు రోజుల ఇన్స్పెక్షన్లో భాగంగా నిబంధనల ఉల్లంఘనల్ని అధికారులు గుర్తించారు. వాహనదారులు, క్యాపిటల్లో ఎక్కడబడితే అక్కడ డర్టీ వెహికిల్స్, ట్రైలర్స్ మరియు బోట్స్ని పార్కింగ్ లాట్స్, ఓపెన్ పబ్లిక్ ఏరియాస్లో విడిచిపెట్టడానికి వీల్లేదు. ఒక్కసారి నోటీసు జారీ అయ్యాక మూడు రోజులపాటు ఆయా వాహనాల్ని అధికారులు పరిశీలిస్తారు. క్లీన్ చేయడం లేదా తొలగించడం చేయకపోతే, ఆ వాహనాన్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. ఆ తరువాత తగిన జరీమానా విధించిన తర్వాతనే వాహనదారులకు ఆ వాహనాల్ని అప్పగిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







