దుబాయ్‌లో బైక్‌ రైడర్‌కు రూ.4,000 దిర్హమ్స్ జరిమానా..!!

- August 16, 2026 , by Maagulf
దుబాయ్‌లో బైక్‌ రైడర్‌కు రూ.4,000 దిర్హమ్స్ జరిమానా..!!

దుబాయ్: రోడ్డుపై బైక్ నడుపుతూ అకస్మాత్తుగా సైడ్‌కు మళ్లడంతో అదుపుతప్పి ప్రమాదానికి కారణమైన ఓ రైడర్‌కు దుబాయ్ ట్రాఫిక్ కోర్టు 4,000 దిర్హమ్స్ జరిమానా విధించింది. అలాగే అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేయాలని ఆదేశించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. దుబాయ్‌లోని ఓ ప్రాంతంలో మోటార్‌సైకిల్ ప్రమాదం జరిగినట్లు పోలీసు ఆపరేషన్స్ రూమ్‌కు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. రైడర్ అకస్మాత్తుగా బైక్‌ను పక్కకు మళ్లించడంతో అదుపుతప్పి బైక్ బోల్తా పడినట్లు గుర్తించారు.

రైడర్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, అకస్మాత్తుగా బైక్‌ను మళ్లించడం వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. మోటార్‌సైకిల్ రిజిస్ట్రేషన్ 2025 నవంబర్‌లోనే గడువు ముగిసింది. అంతేకాకుండా ప్రమాదం జరిగిన సమయానికి బైక్‌కు తప్పనిసరి ఇన్సూరెన్స్ కూడా చెల్లుబాటులో లేదు.

విచారణ సందర్భంగా రైడర్ తన తప్పును అంగీకరించాడు. పోలీసు నివేదిక, ప్రమాద స్థల స్కెచ్, రైడర్ అంగీకారాన్ని పరిశీలించిన కోర్టు.. మొత్తం 4,000 దిర్హమ్స్ జరిమానా విధిస్తూ.. డ్రైవింగ్ ను లైసెన్స్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com