హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఏఐ ఆధారిత అంతర్జాతీయ న్యాయ సేవలు
- August 22, 2026
హైదరాబాద్: “భారత్ను అంతర్జాతీయ న్యాయ సమాజంతో బలమైన వారధిగా అనుసంధానం చేయడం మా లక్ష్యం అని ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ అన్నారు. సరిహద్దులు దాటి న్యాయ వ్యవహారాల్లో మార్గదర్శకత్వం అవసరమైన వ్యక్తులు, వ్యాపార సంస్థలకు అంతర్జాతీయ న్యాయవాదులు, సొలిసిటర్లు, బ్యారిస్టర్లు, అడ్వకేట్ల సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నామన్నారు. మా ఏఐ కార్యక్రమం న్యాయ అవగాహనను పెంపొందించి, సమాచారానికి ప్రాప్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఉందని, అదే సమయంలో అత్యున్నత వృత్తిపరమైన న్యాయ ప్రమాణాలను కొనసాగిస్తామన్నారు. కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ హైదరాబాద్లో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించనుందని వెల్లడించారు.బంజారా హిల్స్లోని ప్రెసిడెంట్ బంజారా హిల్స్, ఫ్లాట్ నంబర్ C3, రోడ్ నంబర్ 2, ముగ్ధ సిల్క్స్ పక్కన ఉన్న కార్యాలయం ఈనెల 24 న ఉదయం 11:30 గంటలకు తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి, హుజూర్నగర్ ఎమ్మెల్యే ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు.
అంతర్జాతీయ న్యాయ సేవలకు కొత్త వేదిక
హైదరాబాద్ కార్యాలయాన్ని అంతర్జాతీయ న్యాయ సేవలు, సరిహద్దులు దాటి న్యాయ సలహాలు, ఏఐ ఆధారిత న్యాయ అవగాహన, వృత్తిపరమైన సహకారానికి కేంద్రంగా అభివృద్ధి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్లోని క్లయింట్లను వివిధ దేశాలకు చెందిన అనుభవజ్ఞులైన అంతర్జాతీయ న్యాయవాదులు, సొలిసిటర్లు, బ్యారిస్టర్లు, అటార్నీలు, అడ్వకేట్లతో అనుసంధానం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
ఏఐతో న్యాయ అవగాహన
హైదరాబాద్ కార్యాలయ కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఆధునిక న్యాయ విధానాలతో బాధ్యతాయుతంగా అనుసంధానం చేయడం కీలక అంశంగా ఉంటుందని సంస్థ తెలిపింది. న్యాయ పరిశోధన, సమాచారాన్ని సులభంగా పొందడం, ప్రాథమిక న్యాయ అవగాహన కల్పించడం, క్లిష్టమైన న్యాయ అంశాలను అర్థం చేసుకోవడంలో ఏఐ, ఆధునిక లీగల్ టెక్నాలజీలను సహాయక సాధనాలుగా వినియోగించనున్నట్లు పేర్కొంది. వృత్తిపరమైన న్యాయ సలహాలు, న్యాయ ప్రాతినిధ్యం మాత్రం సంబంధిత చట్టాలు, వృత్తిపరమైన ప్రమాణాలకు అనుగుణంగా అర్హత కలిగిన న్యాయ నిపుణుల ద్వారానే అందించబడతాయని సంస్థ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ, బహుళ విభాగాల న్యాయ నిపుణుల నెట్వర్క్ మద్దతుగా ఉంది. ఇందులో కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ప్రిన్సిపల్ & ఫౌండర్ డా. శ్రీనివాస రావు కావేటి, కెనడాకు చెందిన అజ్మేరా లా ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్ & ఫౌండర్ డా. ప్రశాంత్ అజ్మేరా, అమెరికాకు చెందిన ఎడ్వర్డ్ ఓసీ, రామ్సేయర్ అవుకు, పార్థ్ సింగ్, యూకేకు చెందిన అడ్వకేట్ అనుప్రియా చావ్లా, అలాగే భారత్కు చెందిన పలువురు హైకోర్టు న్యాయవాదులు, అంతర్జాతీయ న్యాయ సలహాదారులు ఉన్నారు.
భారత్–అంతర్జాతీయ న్యాయ సమాజానికి వారధి
బంజారా హిల్స్లోని కొత్త కార్యాలయం కేవలం సాధారణ న్యాయ కార్యాలయంగా కాకుండా, న్యాయ అవగాహన, అంతర్జాతీయ సహకారం, సరిహద్దులు దాటి న్యాయ నిపుణుల సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఒక వేదికగా పనిచేయాలని సంస్థ భావిస్తోంది.
బహుళ దేశాలకు సంబంధించిన న్యాయ వ్యవహారాలు, అంతర్జాతీయ లావాదేవీలు, ఇమ్మిగ్రేషన్, పెట్టుబడులు, కార్పొరేట్ వ్యవహారాలు, వివాదాలపై న్యాయ మార్గదర్శకత్వం అవసరమైన వారికి అంతర్జాతీయ న్యాయ నెట్వర్క్ ద్వారా సహాయం అందించడమే లక్ష్యమని సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: సీఎం చంద్రబాబు
- సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్కు డీజీపీ సి.వి.ఆనంద్ అభినందనలు
- బీజేపీ కొత్త టీమ్ తో ప్రధాని మోదీ..!
- కార్మికులకు ఆహారం, చల్లని పానీయాలు.. ఇద్దరు మహిళలకు యూఏఈ ప్రభుత్వ సత్కారం
- గచ్చిబౌలి విషాదం పై హైడ్రా సీరియస్..
- ముంబైలో పెట్రోలియం–సహజ వాయువుల స్టాండింగ్ కమిటీ సమావేశాలకు ఎంపీ బాలశౌరి హాజరు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఏఐ ఆధారిత అంతర్జాతీయ న్యాయ సేవలు
- 23 ఏళ్ల తర్వాత ఆన్స్ర్ మాల్ షార్జా నుంచి దుబాయ్, అబుదాబికు తరలింపు..
- మానవత్వానికి ప్రతీకగా ఖతార్ ప్రవాస తెలుగు సమాజం..
- తమిళ సినిమాల పై కీలక నిర్ణయం..







