బహ్రెయిన్లో టీం జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
- August 23, 2026
మనామా: పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా టీం జనసేన బహ్రెయిన్ ఆధ్వర్యంలో ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించారు.బహ్రెయిన్లోని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు, జనసేన మద్దతుదారులు, వీర మహిళలు, వివిధ భారతీయ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్న మానవతా సేవా స్ఫూర్తితో ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. స్వచ్ఛంద రక్తదానం ప్రాధాన్యతపై అవగాహన కల్పించడంతో పాటు సమాజ సేవకు ప్రోత్సాహం అందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
100 మందికి పైగా రక్తదానం
ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని సేవా కార్యక్రమంతో జరుపుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.
చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో నటన, నృత్యం ద్వారా విశేష గుర్తింపు పొందడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేశారని వారు పేర్కొన్నారు. ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయని, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించిందని గుర్తుచేశారు.
టీమ్ జనసేన సభ్యుల సమన్వయం
ఈ రక్తదాన శిబిరాన్ని టీం జనసేన బహ్రెయిన్ సభ్యులు డి.శ్రీనివాస్ రావు, హేమంత్, నాగేష్ జి.,ఎం.సతీష్ కుమార్, భాస్కర్ రాయుడు తదితరులు సమన్వయం చేశారు. టీమ్ సభ్యుల సమిష్టి కృషితో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
రక్తదాన శిబిరం ముగిసిన అనంతరం నిర్వాహకులు, రక్తదాతలు, వీర మహిళలు, అభిమానులు, ఇతర సభ్యులు కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులోనూ సేవా, సామాజిక కార్యక్రమాలను కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు.
రక్తదానం చేసిన ప్రతి ఒక్కరితో పాటు కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లు, అభిమానులు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలను రక్తదానంతో నిర్వహించడం ద్వారా మానవతా సేవకు మరింత ప్రాధాన్యత చేకూర్చామని పేర్కొన్నారు.


తాజా వార్తలు
- బహ్రెయిన్లో టీం జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
- బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: సీఎం చంద్రబాబు
- సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్కు డీజీపీ సి.వి.ఆనంద్ అభినందనలు
- బీజేపీ కొత్త టీమ్ తో ప్రధాని మోదీ..!
- కార్మికులకు ఆహారం, చల్లని పానీయాలు.. ఇద్దరు మహిళలకు యూఏఈ ప్రభుత్వ సత్కారం
- గచ్చిబౌలి విషాదం పై హైడ్రా సీరియస్..
- ముంబైలో పెట్రోలియం–సహజ వాయువుల స్టాండింగ్ కమిటీ సమావేశాలకు ఎంపీ బాలశౌరి హాజరు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఏఐ ఆధారిత అంతర్జాతీయ న్యాయ సేవలు
- 23 ఏళ్ల తర్వాత ఆన్స్ర్ మాల్ షార్జా నుంచి దుబాయ్, అబుదాబికు తరలింపు..
- మానవత్వానికి ప్రతీకగా ఖతార్ ప్రవాస తెలుగు సమాజం..







