సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ

- August 24, 2026 , by Maagulf
సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ

రియాద్: సౌదీ అరేబియాలో భారత రాయబారి విపుల్ ఇటీవల ప్రిన్స్ సౌద్ అల్ ఫైసల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిప్లొమాటిక్ స్టడీస్ డైరెక్టర్ జనరల్ డా.ముషాబబ్ బిన్ అయెద్ అల్ ఖహ్తానీని కలిశారు.

ఈ సందర్భంగా భారత్–సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక శిక్షణ, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల పరస్పర మార్పిడిని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు.

దౌత్య రంగంలో శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, అనుభవాల పరస్పర మార్పిడి ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడంపై సమావేశంలో దృష్టి సారించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com