దేశవ్యాప్తంగా ఆమ్నెస్టీ కార్యాలయాల మూసివేత
- August 18, 2016
దేశద్రోహం కేసుతో ఆమ్నెస్టీ ఇండియా అంశం వివాదాస్పదంగా మారడంతో ఆమ్నెస్టీ చెన్నై, పుణె, దిల్లీ, బెంగళూరుల్లోని కార్యాలయాలను తాత్కాలికంగా మూసేసింది. ఇటీవల బెంగళూరులో ఆమ్నెస్టీ ఇండియా నిర్వహించిన కశ్మీర్పై చర్చ కార్యక్రమం వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆరోపణలతో ఆమ్నెస్టీపై దేశద్రోహం కేసు పెట్టారు. అయితే తమ సంస్థ ఉద్యోగులెవరూ దేశవ్యతిరేక నినాదాలు చెయ్యలేదని సంస్థ ఇప్పటికే తెలిపింది.
ఆమ్నెస్టీకి వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనలు చేసిన నేపథ్యంలో సంస్థ పలు నగరాల్లో కార్యాలయాలు మూసేసింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









