నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!

- August 28, 2026 , by Maagulf
నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!

మనామా: బహ్రెయిన్‌లో నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలు పొందిన కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్, ప్రైవేట్ పత్రాలను నకిలీ చేసి ప్రభుత్వ సంస్థల నుంచి BD50,000కు పైగా అక్రమంగా పొందిన కేసులో నిందితుడికి విధించిన శిక్షను బహ్రెయిన్ ఐదో హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది.

నిందితుడికి ఒక ఏడాది జైలు శిక్షతో పాటు BD1,000 జరిమానా విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ కోర్టు తాజాగా సమర్థించింది. ఫోర్జరీ చేసిన పత్రాలు, తప్పుడు సమాచారాన్ని ఎలక్ట్రానిక్ వ్యవస్థల ద్వారా సమర్పించి వేతన సహాయ పథకం, సామాజిక బీమా ప్రయోజనాలను అక్రమంగా పొందినట్లు కేసులో ఆరోపణలు నమోదయ్యాయి.

ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు నకిలీ పత్రాలు, తప్పుడు వివరాల సమర్పణను గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులకు 10 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం వరకు వివిధ జైలు శిక్షలు విధించారు.

అయితే మరో నిందితుడిపై నేరం నిర్ధారించేందుకు తగిన ఆధారాలు లభించకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. తాజాగా అప్పీల్ కోర్టు ఒక నిందితుడికి విధించిన ఏడాది జైలు శిక్ష, BD1,000 జరిమానాను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com