నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- August 28, 2026
మనామా: బహ్రెయిన్లో నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలు పొందిన కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్, ప్రైవేట్ పత్రాలను నకిలీ చేసి ప్రభుత్వ సంస్థల నుంచి BD50,000కు పైగా అక్రమంగా పొందిన కేసులో నిందితుడికి విధించిన శిక్షను బహ్రెయిన్ ఐదో హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది.
నిందితుడికి ఒక ఏడాది జైలు శిక్షతో పాటు BD1,000 జరిమానా విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ కోర్టు తాజాగా సమర్థించింది. ఫోర్జరీ చేసిన పత్రాలు, తప్పుడు సమాచారాన్ని ఎలక్ట్రానిక్ వ్యవస్థల ద్వారా సమర్పించి వేతన సహాయ పథకం, సామాజిక బీమా ప్రయోజనాలను అక్రమంగా పొందినట్లు కేసులో ఆరోపణలు నమోదయ్యాయి.
ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు నకిలీ పత్రాలు, తప్పుడు వివరాల సమర్పణను గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులకు 10 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం వరకు వివిధ జైలు శిక్షలు విధించారు.
అయితే మరో నిందితుడిపై నేరం నిర్ధారించేందుకు తగిన ఆధారాలు లభించకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. తాజాగా అప్పీల్ కోర్టు ఒక నిందితుడికి విధించిన ఏడాది జైలు శిక్ష, BD1,000 జరిమానాను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు







