నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- August 31, 2026
మస్కట్: నేపాల్లో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో 51 ఏళ్ల ఒమానీ పర్వతారోహకురాలు ఫాతియా అల్ జద్జాలి ప్రాణాలతో బయటపడ్డారు. వరదలకు చిక్కుకుని 72 గంటల పాటు కొండపై సహాయం కోసం ఎదురుచూసిన ఆమెను నేపాల్ అధికారులు చివరకు రెండు హెలికాప్టర్ల ద్వారా రక్షించారు. యాలా పీక్పై ట్రెక్కింగ్కు వెళ్లిన ఫాతియా.. ఆగస్టు 26న కొండ నుంచి కిందకు వస్తుండగా భారీ వరద నీరు, మట్టి ప్రవాహం గ్రామం వైపు దూసుకురావడాన్ని చూసినట్టు తెలిపారు.
తన కళ్ల ముందే హోటల్తో పాటు గ్రామంలోని ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో కొట్టుకుపోతున్న ప్రజల కేకలు కూడా తాను విన్నానని, తన కళ్ల ముందే వారు మరణించారని అప్పటి భయానక సంఘటనలను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.
ఫాతియా మూడు రాత్రులు కొండపైనే చిక్కుకుపోయారు. తాము ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతం కంటే తక్కువ కాదని ఆమె పేర్కొన్నారు.
నేపాల్లోని హిమాలయ ప్రాంతాన్ని భారీ వరదలు, కొండచరియల విరిగిపడటం తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇళ్లు, రహదారులు, వంతెనలు సహా భారీగా మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. వందలాది మంది మృతి చెందగా.. వేలాది మంది కనిపించకుండా పోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?







