భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి

- September 01, 2026 , by Maagulf
భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి

న్యూ ఢిల్లీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో త్వరలో సరికొత్త విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును సాకారం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, దీనిద్వారా జిల్లాలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగవుతాయని తెలిపారు.

సెప్టెంబర్ 7న జిల్లాలో కేంద్ర సాంకేతిక బృందం పర్యటన

విమానాశ్రయ నిర్మాణానికి అత్యంత అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు వీలుగా, 4 నుండి 5 ప్రత్యామ్నాయ ప్రాంతాల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనుంది. ఈ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయనుంది.

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ

ఈ అంశంపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో గతంలో పరిశీలించిన స్థలాలు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనుకూలంగా లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, తాజాగా కొత్తగా గుర్తించిన స్థలాలను సాంకేతిక బృందం పరిశీలిస్తుందని ఇరువురు మంత్రులు చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com