భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ

- September 02, 2026 , by Maagulf
భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ

న్యూఢిల్లీ: భారతదేశంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాయబారిగా అబ్దుల్లా సైఫ్ అల్ నుఐమీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ఆధారపత్రాలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఈ ప్రక్రియ జరిగింది.

ఈ సందర్భంగా అల్ నుఐమీ.. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, ఉపాధ్యక్షుడు, ఉప ప్రధానమంత్రి, ప్రెసిడెన్షియల్ కోర్టు చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు.

భారత ప్రభుత్వం, ప్రజలకు మరింత అభివృద్ధి, సుసంపన్నత కలగాలని యూఏఈ నాయకత్వం ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.

దీనికి ప్రతిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. యూఏఈ నాయకత్వం, ప్రభుత్వం, ప్రజలకు మరింత అభివృద్ధి, పురోగతి కలగాలని ఆకాంక్షించారు.

భారత్‌-యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు రాయబారి అల్ నుఐమీ చేపట్టే కార్యక్రమాలకు భారతదేశం నుంచి పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్రపతి ముర్ము హామీ ఇచ్చారు. తన బాధ్యతల్లో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

భారతదేశంలో యూఏఈకి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని అల్ నుఐమీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో భారత్‌-యూఏఈ మధ్య కొనసాగుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, వివిధ రంగాల్లో సహకారంపై ఇరుపక్షాలు చర్చించాయి. రెండు దేశాల ప్రభుత్వాలు, ప్రజల ప్రయోజనాలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత అభివృద్ధి చేసే మార్గాలపై కూడా చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com