శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవo..
- August 19, 2016
'అప్పట్లో ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటోల ఆధారంగా సినిమా బిజినెస్ జరిగేది. ఇప్పుడు టెక్నాలజీలో ఎన్నో మార్పులొచ్చాయి. ప్రతి ఒక్కరూ ఫొటోలు తీస్తున్నారు. డిజిటల్ యుగం వచ్చినా, ఫొటోగ్రఫీలో ఎన్ని మార్పులొచ్చినా ఫొటోగ్రాఫర్ స్థానం మాత్రం ఎప్పటికీ పదిలమే' అని దాసరి నారాయణరావు అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ ఫొటోగ్రాఫర్లకు దాసరి చేతుల మీదుగా సత్కారం జరిగింది. అనంతరం దాసరి మాట్లాడుతూ, 'ఇప్పుడు సెల్ఫీ పేరుతో ప్రతి ఒక్కరూ ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తుతున్నారు' అని అన్నారు.'మా రెమ్యూనరేషన్ గత 30ఏండ్లుగా అలానే ఉంది. అసోసియేషన్లో చాలా మంది ఆర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. నిర్మాతలు మా పరిస్థితిని అర్థం చేసుకుని రెమ్యూనరేషన్ పెంచాలని కోరుకుంటున్నాం' అని అసోసియేషన్ అధ్యక్షుడు పాల వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్, దామోదర ప్రసాద్, బూర్గుపల్లి శివరామకృష్ణ, శివాజీ రాజా, టి.రామసత్యనారాయణ, అసోసియేషన్ కార్యదర్శి వీరభద్రం, కోశాధికారి రాము తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









