శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవo..
- August 19, 2016
'అప్పట్లో ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటోల ఆధారంగా సినిమా బిజినెస్ జరిగేది. ఇప్పుడు టెక్నాలజీలో ఎన్నో మార్పులొచ్చాయి. ప్రతి ఒక్కరూ ఫొటోలు తీస్తున్నారు. డిజిటల్ యుగం వచ్చినా, ఫొటోగ్రఫీలో ఎన్ని మార్పులొచ్చినా ఫొటోగ్రాఫర్ స్థానం మాత్రం ఎప్పటికీ పదిలమే' అని దాసరి నారాయణరావు అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ ఫొటోగ్రాఫర్లకు దాసరి చేతుల మీదుగా సత్కారం జరిగింది. అనంతరం దాసరి మాట్లాడుతూ, 'ఇప్పుడు సెల్ఫీ పేరుతో ప్రతి ఒక్కరూ ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తుతున్నారు' అని అన్నారు.'మా రెమ్యూనరేషన్ గత 30ఏండ్లుగా అలానే ఉంది. అసోసియేషన్లో చాలా మంది ఆర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. నిర్మాతలు మా పరిస్థితిని అర్థం చేసుకుని రెమ్యూనరేషన్ పెంచాలని కోరుకుంటున్నాం' అని అసోసియేషన్ అధ్యక్షుడు పాల వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్, దామోదర ప్రసాద్, బూర్గుపల్లి శివరామకృష్ణ, శివాజీ రాజా, టి.రామసత్యనారాయణ, అసోసియేషన్ కార్యదర్శి వీరభద్రం, కోశాధికారి రాము తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









