నాల్ కార్డులు ఉపయోగించి నివాసితులు దుబాయ్ ప్రజా పార్కుల్లో ప్రవేశించవచ్చు
- August 21, 2016
దుబాయ్ : పౌరులు నివాసితులు ప్రజా పార్కులలో ప్రవేశించడానికి నాల్ కార్డులు ఉపయోగించడానికి అనుమతించే స్మార్ట్ గేట్లు అమలు ప్రారంభించారు.2017 మొదటి త్రైమాసికంలో లోపల ఈ స్మార్ట్ గేట్లు ప్రారంభమవుతాయని కార్పొరేట్ మద్దతు సెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ జ్యూల్ఫేర్ భావిస్తున్నారు. " ఈ విధానం ద్వారా ప్రతి వ్యక్తి పార్కులు ప్రవేశించడంతో పాటు సొంత నాల్ కార్డు ఉపయోగించడం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థ పోలి పని చేస్తుంది" ఆయన చెప్పారు.దుబాయ్ మున్సిపాలిటీ ఎమిరేట్ లో పార్క్ లలో రోడ్లు, రవాణా అథారిటీ (ఆర్.టి.ఎ) తో పని చేయడానికి ఒప్పందం గత ఏప్రిల్ సంతకం చేసింది. దీని ద్వారా ప్రజా రవాణా కోసం ఉపయోగించే నాల్ చెల్లింపు వ్యవస్థ, విస్తరించే వీలు కానుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ విభాగం యొక్క డి ఎం హేభ అల్ షహీ మాట్లాడుతూ, ఈ అభివృద్ధి విధానం వ్యవస్థని ప్రస్తుతం ముషరఫ్ల పార్క్, అల్ మంజరి మరియు జాబీల పార్క్ వద్ద అమలుచేస్తున్నారు, ఆ తర్వాత మిగిలిన పార్కులలో అమలుచేస్తారు. మా ప్రధాన లక్ష్యం ఏమిటంటే పార్కులలో నివాసితులు త్వరగా మరియు సులభంగా ప్రవేశించడానికి , వెలుపలికి వెళ్ళడానికి అనుమతించే ఒక స్మార్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టటం ద్వారా ప్రజా పార్కులు వద్ద దీర్ఘ క్యూలు తగ్గించేందుకు మంచి అవకాశంగా ఉంది," అల్ షహీ చెప్పారు.ప్రవేశ వ్యవస్థ కాకుండా, స్వీయ సేవ బట్టీలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అదనపు సేవలను కోసం ఈ ప్రజా పార్కులు అందుబాటులో ఉంటాయి .నివాసితులు తనిఖీ మరియు తమ నాల్ క్రెడిట్స్ రీఛార్జ్ మరియు ఇతర ప్రభుత్వ లావాదేవీలు పూర్తి చేయగలరు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







