41 దేశాలతో మల్టీనేషనల్ సముద్ర రక్షణ కూటమి..!!
- September 19, 2026
జెడ్డా: 41 దేశాలతో ఏర్పాటైన మల్టీనేషనల్ మారిటైమ్ డిఫెన్స్ కొహలిషన్ కీలక దశకు చేరుకుంది. కూటమి ఇన్షియల్ ఆపరేషనల్ కేపబిలిటీ (IOC) సాధించిన నేపథ్యంలో, త్వరలో సముద్ర ప్రాంతంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. జెడ్డాలోని వెస్ట్రన్ ఫ్లీట్ కమాండ్ లో గురువారం కూటమి నాలుగో ప్రణాళికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 41 దేశాలకు చెందిన 154 మంది నౌకాదళ కమాండర్లు, ప్లానర్లు, రాయబారులు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరయ్యారు.
ఆపరేషన్ల దిశగా అడుగులు
కూటమి ఏర్పాటు దశ నుంచి ఇప్పుడు క్రియాశీల కార్యకలాపాల దిశగా మారుతోంది. IOC సాధించిన అనంతరం సభ్య దేశాల సామర్థ్యాలను ఒకే వ్యవస్థలో సమన్వయం చేసి, సముద్ర కార్యకలాపాలకు సిద్ధం చేస్తున్నారు. గత ప్రణాళికా సమావేశం తర్వాత జరిగిన పురోగతిని అధికారులు సమీక్షించారు. కూటమిలో అధికారికంగా చేరుతున్న దేశాల వివరాలను కూడా పరిశీలించారు. ఇప్పటికే పలు దేశాలు కూటమి చార్టర్, జాయింట్ స్టేట్మెంట్ పై సంతకాలు చేశాయి. ప్రస్తుతం కూటమిలో 28 మంది లైజన్ అధికారులు ఉన్నారు. తమ దేశాల నుంచి అందించగల నౌకాదళ, ఇతర రక్షణ సామర్థ్యాలను సభ్య దేశాలు గుర్తిస్తున్నాయి.
సముద్ర మార్గాల భద్రతే ప్రధాన లక్ష్యం
కూటమి తదుపరి దశలో సభ్య దేశాల బలగాలు యూనిఫైడ్ కమాండ్ కింద పనిచేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. అనంతరం కూటమి పరిధిలోని సముద్ర ప్రాంతంలో మిషన్లను ప్రారంభించేందుకు బలగాలను మోహరించనున్నారు. అంతర్జాతీయ సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, కీలక సముద్ర మార్గాలు మరియు జలసంధుల భద్రతను పరిరక్షించడం తమ ఉమ్మడి బాధ్యతగా కూటమి పేర్కొంది.
అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సముద్ర నావిగేషన్ భద్రతకు మద్దతు ఇవ్వడం కూటమి ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇందుకోసం యూనిఫైడ్ కమాండ్, సమన్వయంతో కూడిన రక్షణ సామర్థ్యాలు, సమాచార భాగస్వామ్యం, పరస్పర సహకారం ద్వారా సముద్ర రవాణాకు ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనే విధంగా కూటమి పనిచేయనుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో Dh190,000 చోరీ..నిమిషాల్లోనే ముగ్గురు అరెస్ట్..!!
- కువైట్లో ఫైర్ఫోర్స్కు 8,282 అత్యవసర కాల్స్..!!
- అబుదాబి నుంచి రాస్ అల్ ఖైమాకు ఫ్లయింగ్ కార్..!!
- అంగోలా అధ్యక్షుడితో ఒమన్ సుల్తాన్ విందు భేటీ..!!
- ఇజ్రాయెల్ మీడియాలో తప్పుడు కథనాలను ఖండించిన ఖతార్..!!
- 41 దేశాలతో మల్టీనేషనల్ సముద్ర రక్షణ కూటమి..!!
- రెండేళ్ల కష్టాలకు తెర.. ఇద్దరు పిల్లలతో స్వదేశానికి చేరుకున్న భారతీయ మహిళ..!!
- పాస్పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే
- తమిళనాడులో ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం..
- ‘ఓణత్తాళం’ కార్యక్రమంలో భారత రాయబారి డా. శ్రీకర్ రెడ్డి







