హజ్ యాత్రకు వెళ్లే సోదరులకు తెలంగాణ ప్రభుత్వం మెరుగైన సేవలు
- August 21, 2016
తెలంగాణ ప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లే మైనారి టీ సోదరులకు మెరుగైన సేవలు అంది స్తోందని డీప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. మొదటి సారిగా హజ్ యాత్రకు బయలుదేరుతున్న ముస్లింసో దరుల యాత్రను ఆదివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయ న జెండా ఊపి ప్రారంభించారు. నగరం లోని నాపంల్లి హజ్హౌజ్ నుంచి ప్రత్యే క బస్సులు ఏర్పాటు చేసి శంషాబాద్ ఎయిర్ పోర్టులోని హజ్ టర్మినల్కు చే ర్చారు. ఈ సందర్భంగా ఆయన విమా నాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ కల్పిం చని సౌకార్యాలు తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. అలాగే సౌదీలో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అక్కడి ప్రభుత్వంతో సంప్ర దింపులు జరుపుతున్నామని తెలిపారు.మైనారి టీల సంక్షేమం కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం షాదీముబారక్ పథకాన్ని ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. హజ్యాత్ర మొదటి బ్యాచ్లో 45 మంది ముస్లింలు ఎయిర్ఇం డియా విమానంలో బయలుదేరి వెళ్లారు. వీరు 45 రోజుల తరువాత తిరిగి ఇండియా చేరు కుంటారని మంత్రి చెప్పారు. అంతకు ముందు హజ్ టర్నినల్ వద్దకు చేరుకుని అక్కడి పరిసరాలను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పరిశీలించారు.
ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకిల్ అమేర్, డిప్యూటీ మేయర్ బాబా ఫిసీయుద్దీన, హజ్ కమిటీ మెంబర్స్ మహబూబ్, జాఫర్, మేరాజ్, ఫరూక్, ఎమ్మెల్సీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







