హజ్‌ యాత్రకు వెళ్లే సోదరులకు తెలంగాణ ప్రభుత్వం మెరుగైన సేవలు

- August 21, 2016 , by Maagulf
హజ్‌ యాత్రకు వెళ్లే సోదరులకు తెలంగాణ ప్రభుత్వం మెరుగైన సేవలు

 తెలంగాణ ప్రభుత్వం హజ్‌ యాత్రకు వెళ్లే మైనారి టీ సోదరులకు మెరుగైన సేవలు అంది స్తోందని డీప్యూటీ సీఎం మహమూద్‌ అలీ పేర్కొన్నారు. మొదటి సారిగా హజ్‌ యాత్రకు బయలుదేరుతున్న ముస్లింసో దరుల యాత్రను ఆదివారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయ న జెండా ఊపి ప్రారంభించారు. నగరం లోని నాపంల్లి హజ్‌హౌజ్‌ నుంచి ప్రత్యే క బస్సులు ఏర్పాటు చేసి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులోని హజ్‌ టర్మినల్‌కు చే ర్చారు. ఈ సందర్భంగా ఆయన విమా నాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ కల్పిం చని సౌకార్యాలు తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. అలాగే సౌదీలో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అక్కడి ప్రభుత్వంతో సంప్ర దింపులు జరుపుతున్నామని తెలిపారు.మైనారి టీల సంక్షేమం కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం షాదీముబారక్‌ పథకాన్ని ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. హజ్‌యాత్ర మొదటి బ్యాచ్‌లో 45 మంది ముస్లింలు ఎయిర్‌ఇం డియా విమానంలో బయలుదేరి వెళ్లారు. వీరు 45 రోజుల తరువాత తిరిగి ఇండియా చేరు కుంటారని మంత్రి చెప్పారు. అంతకు ముందు హజ్‌ టర్నినల్‌ వద్దకు చేరుకుని అక్కడి పరిసరాలను డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ పరిశీలించారు.
ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్‌ ఎమ్మెల్యే షకిల్‌ అమేర్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫిసీయుద్దీన, హజ్‌ కమిటీ మెంబర్స్‌ మహబూబ్‌, జాఫర్‌, మేరాజ్‌, ఫరూక్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com