థాయ్లాండ్లో భారత్ పర్యాటకులు 10 లక్షల మంది..
- August 23, 2016
భారత్ నుంచి మరింత మంది పర్యాటకులను ఆకర్షించాలని థాయ్లాండ్ యోచిస్తోంది. ప్రస్తుతం భారత్ నుంచి ఏడాదికి 10 లక్షల మందికి పైగా పర్యాటకులు థాయ్లాండ్లోని బ్యాంకాక్ వంటి పట్టణాలకు వస్తున్నారని, ఏడాదికి 10 శాతం చొప్పున భారత పర్యాటకులు పెరిగే విధంగా మరిన్ని పట్టణాలకు భారత పర్యాటకులను ఆకర్షించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని టూరిజం అథారిటీ ఆఫ్ థాయ్లాండ్ డైరెక్టర్ సరోయా హోమ్చెన్ తెలిపారు. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే భారతీయులు థాయ్లాండ్ వస్తున్నారని, గత ఏడాది 300 భారతీయ పెళ్లిళ్లు థాయ్లాండ్లో జరిగాయని చెప్పారు.పెళ్లి ఖర్చుతోపాటు అతిథులుగా వచ్చే వారు కనీసం ఒక్కొక్కరు రూ.20,000 వరకూ షాపింగ్ చేస్తారని వివరించారు. ఈ నేపథ్యంలో థాయ్లాండ్లో పెళ్లిళ్లు చేసుకునేందుకు వివిధ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అదే విధంగా మహిళ పర్యాటకులను ఆకర్షించడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. థాయ్లాండ్కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి పర్యాటకులను ఆకర్షించడానికి హైదరాబాద్లో రోడ్షో నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.భారత్ నుంచి థాయ్లాండ్కు వచ్చే పర్యాటకుల్లో దాదాపు 15 శాతం మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి వస్తున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







