రమ్య వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి..
- August 23, 2016
పొరుగుదేశం పాకిస్థాన్ను పొగుడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్యపై దేశద్రోహం కేసు నమోదైంది. కర్ణాటకలోని మదికేరీలో కత్నమణె విట్టల్ గౌడ అనే న్యాయవాది ఆమెపై కేసు పెట్టారు. శనివారం ఈ కేసు విచారణకు రానుంది.ఇటీవల పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన సార్క్ కార్యక్రమానికి రమ్య హాజరయ్యారు. తిరిగి భారత్కు చేరుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. 'కొందరు అన్నట్లుగా పాకిస్థాన్ నరకమేమీ కాదు. అక్కడి ప్రజలంతా మనలాంటివారే. మమ్మల్ని వారు ఎంతో బాగా చూసుకున్నారు' అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే రమ్య వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.పాకిస్థాన్ను పొగిడేలా మాట్లాడారంటూ ఆమెపై కొందరు విమర్శలు చేశారు.కన్నడంతో పాటు పలు భాషల్లో నటించిన రమ్య.. 2011లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల పాక్, భారత్ మధ్య విభేదాల నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. ఆ దేశాన్ని నరకంతో పోల్చిన విషయం తెలిసిందే. ఇస్లామాబాద్లో జరిగిన సార్క్ దేశాల సమావేశానికి హాజరైన హోంమంత్రి రాజ్నాథ్సింగ్ కూడా పాక్ వైఖరిని ఖండించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







