కమోడిటీ ధరలు పెంపు: 350 కంపెనీలకు జరీమానా
- August 24, 2016
కమోడిటీ ధరల్ని పెంచినందుకుగాను 350 కంపెనీలకు జరీమానా విధించింది కువైట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ప్రభుత్వం ఇంధన ధరల సబ్సిడీలను రేషనలైజ్ చేయడంతో పలు కంపెనీలు, కమర్షియల్ స్టోర్స్ ఇబ్బడిముబ్బడిగా ధరల్ని పెంచేశాయి. అయితే కమర్షియల్ సూపర్విజన్ మరియు కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, నిబంధనలు ఉల్లంఘించి ధరల్ని పెంచిన కంపెనీలు, స్టోర్లపై దాడులు చేసి, వాటికి జరీమానాలు విధించింది. వీటిల్లో గడువు తీరిన ఆహార పదారాల్ని విక్రయిస్తున్నందుకు విధించే జరీమానాలు కూడా ఉన్నాయి. క్యాబినెట్ గైడెన్స్లో కమర్షియల్ సూపర్ విజన్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్స్ ఈ తనిఖీల్ని నిర్వహించారు. ఇంధన ధరల్ని రేషనలైజ్ చేయడం వల్ల ఆహారం మరియు కన్స్యూమర్ వస్తువుల ధరలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఈ సందర్భంగా కమర్షియల్ సూపర్విజన్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఈద్ అల్ రషిది చెప్పారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







