ఆర్.జి.వి పై కేసు నమోదు

- September 05, 2016 , by Maagulf
ఆర్.జి.వి పై కేసు నమోదు

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మపై కర్నూలు పట్టణంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. టీచర్స్‌డే సందర్భంగా ఉపాధ్యాయులపై వర్మ ట్వీట్టర్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు సముచిత స్తానం ఇచ్చారని వారు పేర్కొన్నారు. గురువులపై రాంగోపాల్ వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబుకాదన్నారు. ఉపాధ్యాయులంటే తనకస్సలు నచ్చదని వాళ్లవల్ల ఎంతోమంది విద్యార్థుల జీవితం నాశనం అవుతుందని, స్వయంగా తనకు టీచర్ల వల్లే బుర్ర లేకుండా పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీచర్లు తనకు చాలా బోధించారని, కానీ వాళ్ల నుంచి తాను నేర్చుకుంది ఏమీ లేదని టీచర్స్‌డే సందర్భంగా ట్వీట్ల్ చేసిన విషయం తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com