ఆర్.జి.వి పై కేసు నమోదు
- September 05, 2016
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కర్నూలు పట్టణంలోని టూటౌన్ పోలీస్స్టేషన్లో ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. టీచర్స్డే సందర్భంగా ఉపాధ్యాయులపై వర్మ ట్వీట్టర్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు సముచిత స్తానం ఇచ్చారని వారు పేర్కొన్నారు. గురువులపై రాంగోపాల్ వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబుకాదన్నారు. ఉపాధ్యాయులంటే తనకస్సలు నచ్చదని వాళ్లవల్ల ఎంతోమంది విద్యార్థుల జీవితం నాశనం అవుతుందని, స్వయంగా తనకు టీచర్ల వల్లే బుర్ర లేకుండా పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీచర్లు తనకు చాలా బోధించారని, కానీ వాళ్ల నుంచి తాను నేర్చుకుంది ఏమీ లేదని టీచర్స్డే సందర్భంగా ట్వీట్ల్ చేసిన విషయం తెలిసింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







