రెండు రోడ్డు ప్రమాదాల్లో 20 మందికి గాయాలు

- September 05, 2016 , by Maagulf
రెండు రోడ్డు ప్రమాదాల్లో 20 మందికి గాయాలు

దుబాయ్‌: రెండు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది గాయపడగా, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. శని, ఆదివారాల్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంక్రీట్‌ మిక్సర్‌ ప్రమాదంలో దగ్ధమయ్యింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది గాయపడ్డారని దుబాయ్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ సైఫ్‌ ముహైర్‌ అల్‌ మజ్రోయి తెలిపారు. సెర్బియన్‌ వ్యక్తి తాను నడుపుతున్న కారుతో, ఇండియన్‌ వ్యక్తి నడుపుతున్న వాహనాన్ని డీకొన్నాడనీ, క్షణాల్లోనే ఓ బస్సు ఈ వాహనాల్ని ఢీకొందని ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 14 మంది గాయపడ్డారు. ఆదివారమే జరిగిన ఇంకో ఘటనలో ఓ వాహనం, మెటల్‌ బారియర్‌ని ఢీకొన్న ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. దుబాయ్‌ అల్‌ అయిన్‌ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com