గౌతమిపుత్ర శాతకర్ణి 'రాజసూయ యాగం' స్టార్ట్..
- September 07, 2016
బాలకృష్ణ 'రాజసూయ యాగం' స్టార్ట్ అయ్యింది. మంగళవారం వేద పండితుల మధ్య ఈ యాగం జరుగుతోంది. అఖండ భారతాన్ని ఏకతాటిపై తేవడానికి పురాణాలలో ధర్మరాజు, శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రమే దీన్ని నిర్వహించినట్టు చెబుతున్నారు.
ఈ యాగం సమయంలో శాతకర్ణి.. తల్లి గౌతమి పేరును ముందు ఉంచి గౌతమిపుత్ర శాతకర్ణిగా పేరుని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదంతా బాలయ్య ల్యాండ్మార్క్ మూవీలోని సన్నివేశం. ఈ యాగం మొదలుపెట్టిన రోజు స్వర్గీయ ఎన్టీఆర్ బర్త్ డే కావడం, అలాగే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ పుట్టినరోజు కావడం మరో విశేషంగా నందమూరి ఫ్యాన్స్ చెబుతున్నారు.ఇక మూవీ విషయానికొస్తే ఆగస్టు 29న మధ్యప్రదేశ్లోని ప్రారంభమైన చిత్రీకరణ..ఈనెల 20 వరకు షూట్ జరుగుతుంది. బాలకృష్ణ, హేమామాలిని, శ్రియాలు పాల్గొన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతికి గౌతమిపుత్ర శాతకర్ణిని థియేటర్స్కి తీసుకురావాలన్నది మేకర్స్ థాట్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







