గౌతమిపుత్ర శాతకర్ణి 'రాజసూయ యాగం' స్టార్ట్..

- September 07, 2016 , by Maagulf
గౌతమిపుత్ర శాతకర్ణి 'రాజసూయ యాగం' స్టార్ట్..

బాలకృష్ణ 'రాజసూయ యాగం' స్టార్ట్ అయ్యింది. మంగళవారం వేద పండితుల మధ్య ఈ యాగం జరుగుతోంది. అఖండ భారతాన్ని ఏకతాటిపై తేవడానికి పురాణాలలో ధర్మరాజు, శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రమే దీన్ని నిర్వహించినట్టు చెబుతున్నారు.
ఈ యాగం సమయంలో శాతకర్ణి.. తల్లి గౌతమి పేరును ముందు ఉంచి గౌతమిపుత్ర శాతకర్ణిగా పేరుని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదంతా బాలయ్య ల్యాండ్‌మార్క్ మూవీలోని సన్నివేశం. ఈ యాగం మొదలుపెట్టిన రోజు స్వర్గీయ ఎన్టీఆర్ బర్త్ డే కావడం, అలాగే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ పుట్టినరోజు కావడం మరో విశేషంగా నందమూరి ఫ్యాన్స్ చెబుతున్నారు.ఇక మూవీ విషయానికొస్తే ఆగస్టు 29న మధ్యప్రదేశ్‌లోని ప్రారంభమైన చిత్రీకరణ..ఈనెల 20 వరకు షూట్ జరుగుతుంది. బాలకృష్ణ, హేమామాలిని, శ్రియాలు పాల్గొన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతికి గౌతమిపుత్ర శాతకర్ణిని థియేటర్స్‌కి తీసుకురావాలన్నది మేకర్స్ థాట్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com