సౌదీ అరేబియా ప్రభుత్వం పై ఇరాన్ అధ్యక్షుడి తీవ్ర వ్యాఖ్యలు
- September 07, 2016
సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని శిక్షించాలంటూ బుధవారం ఇరాన్ అధ్యక్షుడు హస్సాన్ రౌహాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇరానీయులను హజ్ యాత్రకు నిషేధించడంపై ఆయన స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరూ కలిసి సౌదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. కేబినేట్ మీటింగ్ లో సౌదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేబినేట్ మీటింగ్ లో చర్చించిన ఆయన ఇస్లాం, ఇరుగుపొరుగు దేశాలను సౌదీపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కేవలం హజ్ యాత్రకు చెందిన సమస్యలైతే పరిష్కరించుకోవచ్చని కానీ, సౌదీ ప్రభుత్వం టెర్రరిజాన్ని పోత్రహిస్తోందని రౌహాని ఆరోపించారు. సౌదీ కారణంగానే ఇరాక్, సిరియా, యెమెన్ లకు నెత్తుటి మరకలు అంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గత ఏడాది హజ్ యాత్రలో వందలాది ఇరానీయుల మరణానికి సౌదీ ప్రభుత్వమే కారణమని ఇరాన్ చేసిన వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా పరిగణించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







