కువైట్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి రాజు క్షమాబిక్ష
- September 07, 2016
కువైట్లో జైలు శిక్ష అనుభవిస్తున్న కొందరికి ఆ దేశ రాజు (అమిర్) షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా క్షమాభిక్ష ప్రకటించారు. బక్రీద్ పండుగ సందర్భంగా కొందరికి మిగిలిన శిక్ష కాలాన్ని మాఫీ చేయగా మరికొందరి శిక్షలను తగ్గించినట్లుగా కువైట్ ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. అయితే ఆ ఖైదీల జాతీయతను మాత్రం ప్రకటించలేదు. కాగా, ఇలాంటి సందర్భాలలో ఖైదీల వివరాలను గల్ఫ్ దేశాలు వెల్లడించవు. భారత నుంచి మాదక ద్రవ్యాలు రవాణా చేస్తూ పట్టుబడి కువైట్ జైళ్లలో మగ్గుతున్న వారిలో పలువురు అమాయకులు ఉన్నారు. వారిలో కొందరు ప్రవాసాంధ్రులు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని కువైట్లోని భారతీయ ఎంబసీతో పాటు కేంద్ర ప్రభుత్వం కువైట్ పాలకుల దృష్టికి తీసుకెళ్లింది. కువైట్ వచ్చిన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీ.కే.సింగ్ ఇక్కడి అధికారులతో సమావేశమయ్యారు. ఆ వెంటనే కువైట్ అమిర్ ప్రకటన వెలువడడం గమనార్హం. కాగా, బుధవారం భారతీయ ఎంబసీలో మహత్మాగాంధీ విగ్రహావిష్కరణ అనంతరం మంత్రి వి.కె.సింగ్ ప్రవాసీ ప్రతినిధులతో సమావేశమవుతారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







