ఉ.కొరియా వరదలు : 133మంది మృతి, 395 మంది గల్లంతు...
- September 12, 2016
ఉత్తరకొరియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భారీస్థాయిలో వరదలు సంభవించాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 133 మంది మృతిచెందగా.. మరో 395 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. యాంగ్యాంగ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐరాస ఈ వివరాలను ప్రకటించింది. ట్యుమెన్ నదీ పరీవాహక ప్రాంతంలో లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రాంతాల్లో సహాయచర్యలు చేపట్టినట్లు దేశ అధికారిక మీడియా పేర్కొంది. 35వేల ఇళ్లు, 8,700 ప్రభుత్వ భవనాలు ధ్వంసమైనట్లు ఐరాస తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







