బక్రీద్, గణేశ్ నిమజ్జనం ఒకే రోజు
- September 12, 2016
బక్రీద్, వినాయక నిమజ్జనం కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీస్ జీహెచ్ఎంసీ యంత్రాంగం సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్రెడ్డి ఉమ్మడిగా సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24గంటలూ ఉద్యోగులను అందుబాటులో ఉంచనున్నారు. రెవెన్యూ, వాటర్ వర్క్స్, ఫైర్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేయనున్నారు. పటిష్ట పోలీస్ భద్రత, సీసీటీవీ పర్యవేక్షణలో నగరంలో ప్రశాంతంగా బక్రీద్, వినాయక నిమజ్జనం పూర్తి చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓల్డ్సిటీలో కవాతు నిర్వహించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







