న్యాయమూర్తిని హతమార్చిన ఐఎస్ఐఎస్
- August 05, 2015
అక్కడ వారు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం.. నాయకులు చట్టాలు శాసనాలు.. చివరకు న్యాయస్థానాలకు కూడా విలువ ఉండదు. జడ్జిలను కూడా విడిచి పెట్టరు. ఇంత ఆటవికంగా వ్యవహరించే వారు ఎవరుంటారు.? ఈ ప్రపంచంలో స్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వ్యవహరించినంత అనాగరికంగా మరెవ్వరూ వ్యవహరించరు. ఓ న్యాయమూర్తిని చంపేశారు. లిబియాలో అల్ కోమ్స్ అపీల్ కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న మహ్మద్ అల్ నమ్లిను సిర్ది అనే నగరంలో కొందరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సాయుధులుగా వచ్చి అపహరించుకుపోయారు. అప్పటి నుంచి ప్రభుత్వం తరుపున ప్రయత్నాలు చేసినా ఉగ్రవాదులు విడిచిపెట్టలేదు. చివరికి చిత్రహింసలు చేసి, నిప్పుపెట్టి కాల్చిన అతడి మృతదేహం అల్ హరవా అనే పట్టణంలో లభించింది. దీంతో లిబియన్ జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ కూడా ఆయన మృతి విషయాన్ని ధృవీకరించింది. ఉగ్రవాద నేరాలకు పాల్పడిన కొందరు వ్యక్తులకు కఠిన శిక్షలు విధించారనే అక్కసుతోనే ఆయనను హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







